నరకాసురుల మధ్య దివాలి!
ప్రజలందరకి దీపావళి శుభాకాంక్షలు. నరకాసురులు మిగిలేవున్న రోజుల్లో కూడా నరకాసుర వధకు గుర్తుగా దీపావళి జరుపుకుంటూ, శుభాకాంక్షలు చెప్పుకోవడం పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న చందంగానే వుంటుంది.. ఒక్కసారి ఆలోచించండి. దీపావళి కథ అందరికీ తెలిసే వుంటుంది. నరకాసురిని బారి నుండి ప్రజలను రక్షించడానికి అప్పుడు సత్యభామ నడుంకట్టి యుద్ధం చేసి అందరిని రక్షించింది. ఇది ఒకప్పటికి కథ.మరి ఇప్పటి నరకాసురుల సంగతేమిటి? రకరకాల కోణాలలో వీదికొక రాక్షసుడు వీరంగం చేస్తున్నాడు. ప్రతి ఒక్కడు ప్రజలపైన పడి బకాసురుల డ్యూటీ కూడా వాళ్ళే చేస్తున్నారు. వీళ్ళందరి మధ్య మనం దీపావళి ఆనందంగా జరుపుకోవడమంటే ఒకప్పటి స్వాతంత్రానికి పరతంత్రంలో పండగ చేసుకోవడమే. ఇలాంటి అసురుల నుండి ప్రజల్ని రక్షించేందుకు ఎలాంటి సత్యభామలు పుట్టుకురావాలి? ఎప్పుడు పుట్టుకురావాలి? స్త్రీ శక్తికి ప్రతిరూపంగా నిలవాల్సిన కొంతమంది... నరకాసురుల పంచన చేరడంతో టపాకాయలు కొన్నవాడికి ఆటం బాంబు ఫ్రీ గా వచ్చినంత బలంగా తయారయ్యి వారి ఆగడాలకు మరింత వెసులుబాటు కలిగింది. మనకు అనుకూలంగా వుంటే జగన్నాటక సూత్రధారి, లేకపోతే కపటనాటక సూత్రధారి అనే భ్రమలో బతికెయ్యడం అందరికి అలవాటై పోయింది కాబట్టి ఈ విషయాలన్నీ మర్చిపోయి ఇలాగే బతికేద్దాం. తారాజువ్వలా ఎగరలేక పోయినా ఎగురుతున్న దానిని చూసి మనం కూడా ఎగురుదాం అని ఆశిద్దాం. మరొక్కసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

ThanQ Sir & Wish U The same
రిప్లయితొలగించండి